అహ్మదాబాద్లో (Ahmedabad) జరిగిన ఘోర విమాన ప్రమాదం (Plane Crash) దేశవ్యాప్తంగా విషాదం నింపింది. గురువారం టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా (Air India) విమానం BJ మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిపోయింది. ఈ ఘటనలో మెడికోలకు (Medicos) గాయాలు అయ్యాయి. సహాయక చర్యలు (Rescue operations) కొనసాగుతున్నాయి.
అహ్మదాబాద్, జూన్ 12: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది మరణించారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా (Air India) విమానం బోయింగ్ డ్రీమ్లైన్ 787.. వెంటనే జనావాసాలపై కుప్ప కూలిపోయింది.
అహ్మదాబాద్లోని మేఘనినగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే.. ఎయిర్ ఇండియా విమానం BJ మెడికల్ కాలేజ్ భవనంపై కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో కాలేజ్ భవనంతోపాటు.. మరో ఇతర భవనంలో కూడా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మెడికోలకు (Medicos) చనిపోయినట్టు సమాచారం. దీనికి సంబంధించి కచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది.
హాస్పిటల్ హాస్టల్ (Hostel) బిల్డింగ్పై విమానం కూలిందని.. రెండు భారీ భవనాల్లో మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. విమానం కూలడంతో భవనాలు నేలమట్టమయ్యాయి. సహాయక చర్యలు (Rescue operations) కొనసాగుతున్నాయి.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.