March 27, 2026

భారతదేశంలో ముందుగానే చేరిన రుతుపవనాలు

రుణపవనాలు ముందుగానే కేరళ తీరాన్ని తాకాయి అవి వివిధ ప్రాంతాలకు విస్తరించనున్నారు. చల్లని కబురు ముందుగానే అందింది. సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకే వర్షాలు ఈసారి ఎట్టకేలకు మే 24న గమ్యం చేరుకున్నాయి. ఇది గత పదిహేను సంవత్సరాల్లోనే అత్యంత ముందస్తు ప్రవేశం. భారత వాతావరణ శాఖ ఈ విషయం ధృవీకరించింది.

ఈసారి భారతదేశానికి దక్షిణాదినుంచి ప్రవేశించే వర్షాకాలం (సౌత్‌వెస్ట్ మాన్సూన్) మే 24న కేరళను తాకింది. ఇది సాధారణ తేదైన జూన్ 1కు ఎనిమిది రోజులు ముందుగా రావడం విశేషం. ఇది 2009 తర్వాత వర్షాకాలం అత్యంత ముందుగానే రావడమని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

ఈ ముందస్తు వర్షాకాలం ప్రవేశం, మే 27లోపు వర్షాలు కేరళకు వచ్చే అవకాశం ఉందని నాలుగు రోజుల మార్జిన్‌తో వాతావరణ శాఖ చెబిన అంచనాలకు అనుగుణంగా ఉందని IMD శాస్త్రవేత్త నీతా కె. గోపాల్ తెలిపారు. “వాస్తవంగా మే 27న వర్షాకాలం వచ్చే అవకాశం ఉందని మేము ముందుగానే అంచనా వేశాము. నాలుగు రోజుల ముందుగా లేదా తరువాతగా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాం. ఇప్పుడు వాస్తవంగా మే 24న వర్షాకాలం ప్రారంభమవడంతో, మేము చేసిన అంచనా సత్యమయ్యింది,” అని ఆమె ఓ వార్త సంస్థకు తెలిపారు.

వర్షాకాలం కేవలం కేరళను మాత్రమే కాక, లక్షద్వీప్, దక్షిణ అరేబియా సముద్రం, పశ్చిమ మధ్య మరియు తూర్పు మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించింది.

అలాగే మాల్దీవులు, కోమొరిన్, తమిళనాడు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతం, మిజోరాం మరియు ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో కూడా వర్షాకాలం విస్తరించింది.

మరో రెండు నుండి మూడు రోజుల్లో వర్షాలు అరేబియా సముద్రం మధ్యభాగం, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తూర్పు హిమాలయ పాద ప్రాంతాలు, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల వైపు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఎందుకు ముందుగానే వచ్చింది వర్షాకాలం?
ఈసారి వర్షాకాలం ముందుగా రావడానికి అనేక వాతావరణ, సముద్ర సంబంధిత పరిస్థితులు కారణమయ్యాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తక్కువ పీడన ప్రాంతం, విదర్భ మీదుగా సాగిన ట్రఫ్ లైన్ వలన గాలి ద్వారా తేమ ఎక్కువగా చేరడం, వాయుమండలంలో ఒత్తిడులు పెరగడం వంటివి వర్షాకాలాన్ని వేగంగా భారతదేశం వైపు నడిపించాయి.

ఇది మే 13నే ఆందమాన్ సముద్రం దక్షిణ భాగం వరకు వర్షాలు చేరడం ద్వారా స్పష్టమయ్యింది. సాధారణంగా అక్కడ మే 21న వర్షాకాలం మొదలవుతుంది.

అంతేకాకుండా, ఈ ఏడాది ఎల్‌నినో పరిస్థితులు లేకపోవడం కూడా వర్షాకాలం సాధారణంగా లేదా బలంగా రావడానికి తోడ్పడింది. మరోవైపు, హిమాలయ ప్రాంతంలో మంచు కవచం తక్కువగా ఉండటంతో వర్షాల శక్తి మరింతగా పెరిగే అవకాశం ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *